Sudha Murty : చైనాతో పోటీ పడాలంటే మన యువ టెకీలు, భారత ఉద్యోగులు వారానికి 70 గంటల పాటు పనిచేయాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్ధాపకులు నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై హాట్ డిబేట్ సాగుతోంది. వారానికి 70 గంటల పాటు కష్టపడి పనిచేస్తేనే మనం వృద్ధి పధంలో ముందుకు సాగుతామని, పనికి ప్రత్యామ్నాయం లేదని నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది.
సుదీర్ఘంగా పనిచేస్తే ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతుందని, ఉద్యోగుల వర్క్-లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతింటుందనే ఆందోళన వెల్లడైంది. అయితే వారానికి 70 గంటలు పనిచేయాలని నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలను ఆయన భార్య సుధా మూర్తి సమర్ధించారు. తానిప్పటికీ ఈ వయసులోనూ వారానికి 70 గంటలు పైగా పనిచేస్తానని ఆమె పేర్కొన్నారు.
మీ వర్క్ను మీరు ఎంజాయ్ చేస్తూ, పని పట్ల నిబద్ధతతో వ్యవహరిస్తే అప్పుడు పని కూడా హాలిడేలా ఉంటుందని సుధా మూర్తి వ్యాఖ్యానించారు. ఐటీ దిగ్గజం నారాయణమూర్తి దంపతులతో ఓ వార్తా ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
Read More :
Akshay Kumar | ముంబై మెట్రోలో ప్రయాణించిన అక్షయ్ కుమార్.. వీడియో