న్యూఢిల్లీ, మే 8: ఆర్థిక సమస్యలతో ఎన్సీఎల్టీ వద్ద దివాలా పిటిషన్ దాఖలు చేసిన విమానయాన సంస్థ గో ఫస్ట్ను.. టికెట్ల విక్రయాల్ని తక్షణం నిలిపి వేయాలని ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ ఆదేశించింది.
ఈ నెల 12దాకా విమానాల్ని రద్దు చేస్తున్నట్టు, 15 వరకూ టికెట్ల విక్రయాన్ని నిలిపివేస్తున్నట్టు గత వారం గో ఫస్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు జారీచేసేంతవరకూ టికెట్ల విక్రయం, బుకింగ్స్ చేయరాదంటూ ఆదేశించినట్టు సంబంధిత వర్గాలు సోమవారం తెలిపాయి.