ముంబై, ఫిబ్రవరి 28: దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. ఎనిమిదోరోజూ సూచీలు నిరాశపర్చాయి. మంగళవారం ట్రేడింగ్లో బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 326.23 పాయింట్లు లేదా 0.55 శాతం పడిపోయి నాలుగు నెలల కనిష్ఠాన్ని తాకుతూ 58,962.12 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 88.75 పాయింట్లు లేదా 0.51 శాతం క్షీణించి నాలుగు నెలలకుపైగా కనిష్ఠాన్ని సూచిస్తూ 17,303.95 వద్ద నిలిచింది. ఆయిల్, గ్యాస్, ఐటీ స్టాక్స్లో అమ్మకాల ఒత్తిడి నమోదైంది. కాగా, 2019 మే నెలలో వరుసగా స్టాక్ మార్కెట్లు 9 రోజులు నష్టపోయాయి. మళ్లీ ఆ స్థాయి నష్టాలు ఇప్పుడే వాటిల్లుతున్నాయి.