ముంబై, ఫిబ్రవరి 10: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల వార్తలకు తోడు టారిఫ్లపై అనిశ్చిత పరిస్థితులు ముగియడంతో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. లాభాల్లో ప్రారంభమైన సూచీలు ఇంట్రాడేలో 400 పాయింట్లకు పైగా ఎగబాకింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 208.17 పాయింట్లు అందుకొని 84,273.92 పాయింట్ల వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ 67.85 పాయింట్లు ఎగబాకి 25,935.15 వద్ద స్థిరపడింది. సూచీల్లో ఎటర్నల్, టాటాస్టీల్, మహీంద్రా, పవర్గ్రిడ్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, లార్సెన్ అండ్ టుబ్రో, టీసీఎస్, మారుతి, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, హెచ్యూఎల్ షేర్లు లాభాల్లో ముగిశాయి.