Stock Market Opening Bell | దేశీయ బెంచ్ సూచీలు మంగళవారం నష్టాల్లో మొదలయ్యాయి. ప్రపంచ మార్కెట్లలోని ప్రతికూల పవనాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం పడింది. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ నష్టాల్లో ప్రారంభమైంది. 72,723.53 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంది. స్టాక్ ఆ తర్వాత కోలుకున్నది. ప్రస్తుతం 35 పాయింట్ల లాభంతో 72,825.13 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నది. ఇవాళ ఇప్పటి వరకు 72,660.13 పాయింట్ల కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. 72,839.67 పాయింట్ల గరిష్ఠానికి చేరుకున్నది. నిఫ్టీ సైతం నష్టాల్లోనే మొదలైంది. 20.15 పాయింట్ల లాభంతో 22,124.75 పాయింట్ల వద్ద కొనసాగుతున్నది. టీసీఎస్, గ్రాసిమ్, ఐచర్ మోటార్స్, సిప్లా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లాభాల్లో కొనసాగుతుండగా.. ఓఎన్జీసీ, యూపీఎల్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మరో వైపు ఆసియా మార్కెట్లు సైతం నష్టాల్లోనే కొనసాగుతున్నాయి.