Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఉదయం గ్రీన్ మార్క్లో మొదలైన స్టాక్ మార్కెట్లు.. కొద్దిసేపటికి ఊగిసలాడాయి. ఆ తర్వాత కొనుగోళ్లతో సూచీలు కోలుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే వరకు సెన్సెక్స్ 110.9 పాయింట్లు పెరిగి 64,996.60 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 40.20 పాయింట్లు పెరిగి రూ.19,306 పాయింట్ల వద్ద ముగింది. ట్రేడింగ్లో దాదాపు 1,992 షేర్లు పురోగమించగా.. 1,635 షేర్లు క్షీణించాయి. 156 షేర్లు మారలేదు.
నిఫ్టీలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్, లార్సెన్ అండ్ టూబ్రో, ఎంఅండ్ఎం, బీపీసీఎల్ లాభపడ్డాయి. నష్టపోయిన వాటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందాల్కో ఇండస్ట్రీస్, అదానీ ఎంటర్ప్రైజెస్, నెస్లే ఇండియా, హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ, ఐటీ మినహా మిగితా అన్నిరంగాల సూచీలు, రియాల్టీ, క్యాపిటల్ గూడ్స్ ఒక్కోశాతం పెరిగాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు 0.5 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేశాయి.