ముంబై: దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులు స్టాక్ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపాయి. సోమవారం ఉదయం సూచీలు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 1479 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 14400 పాయింట్ల దిగువకు వచ్చింది. బ్యాంకింగ్ రంగ షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. కొవిడ్ భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. గత 24 గంటల్లో దేశంలో కరోనా కేసులు కొత్త రికార్డులు సృష్టించాయి. ఏకంగా 1.69 లక్షల కేసులు నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో లాక్డౌన్ విధించే అవకాశాలను అక్కడి ప్రభుత్వం సీరియస్గా పరిగణిస్తోంది. ఇది కూడా మార్కెట్లపై ప్రభావం చూపాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, యూపీఎల్, బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్, ఇండియన్ ఆయిల్, హీరో మోటో కార్ప్, యాక్సిస్ బ్యాంక్ నష్టపోయాయి.
ఇవి కూడా చదవండి
కరోనా కల్లోలం.. ఇండియాలో కొత్తగా 1.69 లక్షల కేసులు
సుప్రీంకోర్టులో కరోనా కలకలం.. 50 శాతం సిబ్బందికి పాజిటివ్!
బెస్ట్ డైరక్టర్ జావో.. నోమాడ్ల్యాండ్కు నాలుగు బాఫ్టా అవార్డులు
కుంభమేళా.. కొవిడ్ నిబంధనలు పాటించని భక్తులు
బాఫ్టా అవార్డ్ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్గా ప్రియాంక చోప్రా, నిక్