Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ -30 ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ-50 సూచీ నిఫ్టీ ఒక శాతానికి పైగా పతనం అయ్యాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 1031.61 పాయింట్ల (1.35 శాతం) నష్టంతో 76,347.26 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్లో 77,128.35 పాయింట్ల గరిష్టం నుంచి 76,249.72 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. మరోవైపు ఎన్ఎస్ఈ-50 సూచీ నిఫ్టీ 345.55 పాయింట్లు (1.47 శాతం) నష్టంతో 23,085.95 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్గత ట్రేడింగ్లో 23,340.95 పాయింట్ల గరిష్టానికి, 23,047.25 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. ఫలితంగా ఇన్వెస్టర్లు రూ.14 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయారు.
ఎన్ఎస్ఈ-50లో 46 స్టాక్స్ నష్టపోయాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, ట్రెంట్, బీపీసీఎల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, భారత్ ఎలక్ట్రానిక్స్ నష్టపోయాయి. మరోవైపు యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, హిందూస్థాన్ యూనీ లివర్, ఇండస్ఇండ్ బ్యాంకు సహా నాలుగు స్టాక్స్ 0.78 శాతం వరకూ లాభ పడ్డాయి.
బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్లో జోమాటో, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టపోయాయి. టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్, హెచ్యూఎల్ షేర్లు మాత్రమే లాభ పడ్డాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ 80.83 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, ఔన్స్ బంగారం ధర 2708.డాలర్ల వద్ద నిలిచింది.