Stock Market Closing Bell | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఒకే రోజు ఏకంగా 1600పాయింట్లు, నిఫ్టీ 460 పాయింట్లకుపైగా పతనమయ్యాయి. ఇటీవల కాలంలో వరుసగా రికార్డు స్థాయిలో సాక్ట్ మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. గ్లోబర్ మార్కెట్లలో ప్రతికూల పవనాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపింది. దాంతో పాటు సూచీలు గరిష్ఠానికి చేరుకున్న నేపథ్యంలో మదుపరులు లాభాలను ఆర్జించేందుకు ఆసక్తి చూపారు.
దాంతో స్టాక్ మార్కెట్లు భారీగా అమ్మకాలతో ఒత్తిడికి గురయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 72,409.71 పాయింట్ల వద్ద సెన్సెక్స్ నష్టాల్లో మొదలైంది. ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేదు. చివరకు 1,628.01 పాయింట్లు పతనమై 71,500.76 వద్ద ముగిసింది. మరోవైపు, నిఫ్టీ 473.35 పాయింట్లు కోల్పోయి 21,558.95 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఏడాదిన్నర తర్వాత 21,600 పాయింట్ల దిగువకు దిగజారడం ఇదే తొలిసారి. ట్రేడింగ్లో దాదాపు 998 షేర్లు పురోగమించగా.. 2,238 షేర్లు క్షీణించాయి. 50 షేర్లు మాత్రం మారలేదు.
నిఫ్టీలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ మరియు హిందాల్కో ఇండస్ట్రీస్ అత్యధికంగా నష్టపోయాయి. హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఇన్ఫోసిస్, ఎల్టీఐఎండ్ట్రీ, టీసీఎస్ లాభపడ్డాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినహా అన్ని రంగాల్లో బ్యాంక్ ఇండెక్స్ 4 శాతం, ఆటో, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ రియాల్టీ ఒకటి నుంచి రెండుశాతం వరకు క్షీణించడంతో అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు ఒక్కోశాతం చొప్పున క్షీణించాయి.