Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లలో సానుకూల పవనాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 73,666.51 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఆ తర్వాత చివరి వరకు అదే రోజును కొనసాగించాయి. ఇంట్రాడేలో 73,227.32 పాయింట్ల కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. గరిష్ఠంగా 73,767.80 పాయింట్ల మార్క్ను అందుకున్నది. చివరకు 560.29 పాయింట్ల లాభంతో 73,648.62 పాయింట్ల వద్ద స్థిరపడింది.
నిఫ్టీ సైతం 189.40 పాయింట్ల లాభంతో 22,336.40 పాయింట్ల వద్ద ముగిసింది. దాదాపు 2,465 షేర్లు పురోగమించగా.. 1,148 షేర్లు పతనమయ్యాయి. మరో 134 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో బీపీసీఎల్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఐషర్ మోటార్స్, ఎల్ అండ్ టీ, శ్రీరామ్ ఫైనాన్స్ లాభాల్లో ముగిశాయి. ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్ నష్టపోయాయి. ఆటో, పీఎస్యూ బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్ఎంసీజీ, హెల్త్కేర్, రియాల్టీ సూచీలు ఒకటి నుంచి మూడుశాతం మధ్య పెరుగడంతో అన్నిరంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈలో మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు ఒక్కోశాతం చొప్పున లాభపడ్డాయి.