Stock Market Close | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు వరుసగా మూడోరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలతో దేశీయ మార్కెట్లు సైతం లాభాల్లో పయనించాయి. సెన్సెక్స్ 72,061.47 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఆ తర్వాత స్వల్పంగా పతనమయ్యాయి. చివరలో మళ్లీ కోలుకుంది. ఇంట్రాడేలో 71,644.44 పాయింట్ల కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. 72,164.97 పాయింట్ల గరిష్ఠానికి చేరింది. చివరకు 227.55 పాయింట్ల లాభంతో 72,050.38 పాయింట్ల వద్ద స్థిరపడింది.
నిఫ్టీ సైతం 70.80 పాయింట్లు పెరిగి 21,910.80 వద్ద ముగిసింది. ట్రేడింగ్లో దాదాపు 2,172 షేర్లు పురోగమించగా.. 1,200 షేర్లు క్షీణించాయి. మరో 72 షేర్లు మాత్రం మారలేదు. మారలేదు. నిఫ్టీలో ఎంఅండ్ఎం, బీపీసీఎల్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, పవర్గ్రిడ్ కార్పొరేషన్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. యాక్సిస్ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, ఐటీసీ, హెచ్యూఎల్, నెస్లే ఇండియా టాప్ లూజర్స్గా నిలిచాయి. సెక్టోరల్లో ఎఫ్ఎంసీజీ మినహా మిగిలిన అన్ని సూచీలు లాభాల్లోనే ముగిశాయి. బీఎస్ఈలో మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు ఒక్కోశాతం చొప్పున పెరిగాయి.