Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్లలోని మిశ్రమ ఫలితాల మధ్య మార్కెట్లు నష్టాల్లోనే మొదలయ్యాయి. ఆ తర్వాత స్వల్పంగా కోలుకున్నా చివరకు నష్టాల్లోనే ముగిశాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 73,225 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 73,684.93 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. 73,073.92 పాయింట్ల కనిష్ఠానికి చేరింది. చివరకు 45.46 పాయింట్లు పతనమై 73,466.39 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం ప్లాట్గా ముగిసింది.
క్రితం సెషన్లో 22,302.50 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ.. 22,302.50 పాయింట్ల వద్ద స్థిరపడింది. బీఎస్ఈలో 2,133 స్టాక్స్ పురోగమించగా.. మరో 1,661 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ 1.7శాతం పెరిగాయి. నిఫ్టీ మెటల్, ఆటో, ఒక్కొక్కటి 1.48శాతం వృద్ధిని నమోదు చేయగా.. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ 0.8శాతం తగ్గింది. నిఫ్టీలో హీరో మోటోకార్ప్, బీపీసీఎల్, టాటామోటార్స్, పవర్గ్రిడ్ కార్పొరేషన్, హిందాల్కో, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, లార్సెన్స్ లాభాల్లో ముగియగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఏషియన్ పేయింట్స్, గ్రాసిమ్స్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్యూఎల్, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, శ్రీరాం ఫైనాన్స్ నష్టపోయాయి.