Stock Market Close | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు వరుసగా మూడోరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలతో.. దేశీయ మార్కెట్లపై ప్రభావం పడుతున్నది. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 74వేల పాయింట్ల ఎగువన.. 74,048.94 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 74,059.89 పాయింట్ల గరిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. 74,048.94 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 89.84 పాయింట్ల లాభంతో 73,738.45 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ సైతం 31.60 పాయింట్ల లాభంతో 22,368.00 వద్ద ముగిసింది. దాదాపు 2,224 షేర్లు పురోగమించగా.. 1450 షేర్లు క్షీణించాయి. 109 షేర్లు మారలేదు. నిఫ్టీలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్టెల్, నెస్లే ఇండియా, మారుతీ సుజుకీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్ లాభపడ్డాయి. సన్ ఫార్మా, బీపీసీఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎంఅండ్ఎం, హిందాల్కో ఇండస్ట్రీస్ నష్టపోయాయి. సెక్టార్లలో హెల్త్కేర్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ 0.3-0.8 శాతం పతనమయ్యాయి. ఎఫ్ఎంసీజీ, పవర్, ఐటీ, రియాల్టీ, ఆటో 0.4-2 శాతం పెరిగాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం, స్మాల్క్యాప్ ఇండెక్స్ ఒకశాతం పెరిగాయి.