Stock Market Close | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు గురువారం లాభాల్లో ముగిశాయి. నిన్న సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకోగా.. లక్షలాది కోట్ల మదుపరుల సంపద ఆవిరైంది. ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైనా ఆ తర్వాత సూచీలు కోలుకొని లాభాల్లో పయనించాయి. చివరి వరకు సూచీలు గ్రీన్ మార్క్లోనే కొనసాగాయి. సెన్సెక్స్ మరోసారి 73వేల మార్క్ను దాటింది.
బ్యాకింగ్ రంగాల షేర్లు మినహా మిగతా సూచీలన్నీ రాణించాయి. కిత్రం సెక్షన్తో పోలిస్తే సెన్సెక్స్ ఉదయం 72,570.10 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలైంది. ప్రారంభంలోనే 72,497.19 పాయింట్ల కనిష్ఠానికి చేరింది. ఇంట్రాడేలో 73,364.30 పాయింట్ల గరిష్ఠానికి చేరుకున్నది. చివరకు 335.39 పాయింట్ల లాభంతో 73,097.28 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 149 పాయింట్లు 22,146.70 వద్ద ముగిసింది. ట్రేడింగ్లో 2,612 షేర్లు పురోగమించగా.. 1090 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, హీరో మోటోకార్ప్, హిందాల్కో ఇండస్ట్రీస్, ఓఎన్టీసీ టాప్ గెయినర్స్గా నిలిచాయి.
యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, జెఎస్డబ్ల్యూ స్టీల్ నష్టపోయాయి. బ్యాంక్ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభాల్లో కొనసాగాయి. టెలికాం, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్ ఒక్కొక్కటి 3 శాతం పెరగ్గా.. ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హెల్త్కేర్, మెటల్ ఒకటి నుంచి రెండుశాతం వరకు పెరిగాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 2.2 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3శాతం లాభపడ్డాయి.