Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పవనాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 72,396.97 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలైంది. ఏ దశలోనూ మార్కెట్లు కోలుకోలేదు. పొద్దంతా ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. ఇంట్రాడేలో 72,705.29 పాయింట్ల గరిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. 72,363.03 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది. చివరకు 361.64 పాయింట్ల నష్టంతో 72,470.30 పాయింట్ల వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 92.05 పాయింట్ల పతనమై.. 22,004.70 వద్ద ముగిసింది. ట్రేడింగ్లో 1,355 షేర్లు పురోగమించగా.. 2447 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, బ్రిటానియా ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, ఎల్అండ్టీ టాప్ గెయినర్స్గా నిలిచాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఐషర్ మోటార్స్, భారతీ ఎయిర్టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, విప్రో నష్టపోయాయి. సెక్టోరల్లో బ్యాంక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ ఒక్కొక్కటి 0.5 శాతం తగ్గగా.. క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్ 0.5-1 శాతం పెరిగాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం పెరిగి స్మాల్క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్గా ముగిశాయి.