Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ మరోసారి ఆల్టైమ్ హైకి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల పవనాలు వీస్తున్నా.. దేశీయ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. చివరి వరకు అదే ఊపును కొనసాగించాయి. కిత్రం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 74,953.96 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 74,807.55 పాయింట్ల కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. చివరి అరగంటలో 75,105.14 పాయింట్లకు పెరిగింది. చివరకు 354.45 పాయింట్ల లాభంతో 75,038.15 వద్ద స్థిరపడింది. నిఫ్టీ క్రితం సెషన్తో పోలిస్తే 22,720.25 పాయింట్ల వద్ద లాభంతో మొదలైంది.
ఇంట్రాడేలో 22,775.70 పాయింట్లకు చేరి జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నది. చివరలో 111.05 పాయింట్ల లాభంతో 22,753.80 వద్ద ముగిసింది. ట్రేడింగ్లో దాదాపు 1761 షేర్లు పురోగమించగా.. 1617 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో కోల్ ఇండియా, బీపీసీఎల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, హిందాల్కో ఇండస్ట్రీస్ టాప్ గెయినర్లు నిలిచాయి. సిప్లా, మారుతీ సుజుకీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, దివీస్ ల్యాబ్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నష్టపోయాయి. మీడియా, పీఎస్యూ బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ 1-2 శాతంతో ఫార్మా మినహా అన్ని రంగాల సూచీలు గ్రీన్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు 0.5 శాతం చొప్పున పెరిగాయి.