Stock Market Close | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలకు తోడు ఫారిన్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, క్రూడ్ ఆయిల్ ధరల సడలింపుతో భారతీయ మరోసారి జీవనకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. కిత్రం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 74,555.44 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఆ తర్వాత సూచీలు అదే జోరును కొనసాగించాయి. మధ్యాహ్నం వరకు సెన్సెక్స్ 74,869.30 పాయింట్లకు చేరుకొని తాజాగా ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నది.
చివరకు 494.28 పాయింట్ల లాభంతో 74,742.50 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం కిత్రం సెషన్తో పోలిస్తే 22,578.35 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో ఆ తర్వాత 22,550.35 కనిష్ఠానికి చేరిన నిఫ్టీ ఆ తర్వాత కోలుకొని 22,697.30 పాయింట్ల గరిష్ఠానికి చేరి జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నది. దాంతో బీఎస్ఈలో అన్ని లిస్టెడ్ స్టాక్స్ సంయుక్త మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.3లక్షల కోట్లు పెరిగి.. తొలిసారిగా రూ.400లక్షల కోట్ల మార్క్ను అధిగమించింది.
చివరకు 152.60 పాయింట్ల లాభంతో 22,666.30 పాయింట్ల వద్ద ముగిసింది. ట్రేడింగ్లో దాదాపు దాదాపు 1695 షేర్లు పురోగమించగా, 1733 షేర్లు క్షీణించాయి. నిఫ్టీలో ఐషర్ మోటార్స్, మారుతీ సుజుకీ, ఎం అండ్ ఎం, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎన్టీపీసీ అత్యధికంగా లాభపడగా.. అదానీ పోర్ట్స్, నెస్లే ఇండియా, అపోలో హాస్పిటల్స్, విప్రో, సన్ ఫార్మా నష్టపోయాయి. సెక్టోరల్లో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పీఎస్యూ బ్యాంక్ మినహా, ఆటో, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, రియాల్టీ ఒక్కొక్కటి ఒకశాతం వృద్ధితో లాభాల్లో ముగిశాయి. బీఎస్ఇ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.26 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్గా ముగిసింది.