Stock Market Close | దేశీయ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య సూచీలు ఉదయం స్వల్ప లాభాల్లో మొదలయ్యాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఇంట్రాడేలో మళ్లీ పుంజుకున్నాయి. కిత్రం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 72,036.86 వద్ద లాభంతో ప్రారంభమైంది. కొద్దిసేపటి 71,674.42 పాయింట్ల కనిష్ఠానికి చేరుకున్న సెన్సెక్స్.. ఇంట్రాడేలో 72,402.67 పాయింట్ల గరిష్ఠానికి పెరిగింది. చివరకు 89.64 పాయింట్ల లాభంతో 72,101.69 వద్ద ముగిసింది.
నిఫ్టీ 21.60 పాయింట్లు పెరిగి 21,839.10 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో దాదాపు 1,563 షేర్లు పెరగ్గా.. 2,064 షేర్లు పతనమయ్యాయి. మరో 119 షేర్లలో మార్పులు కనిపించలేదు. నిఫ్టీలో ఐషర్ మోటార్స్, మారుతీ సుజుకీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, నెస్లే ఇండియా, ఓఎన్టీసీ టాప్ గెయినర్స్గా నిలిచాయి. టాటా స్టీల్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, సిప్లా నష్టపోయాయి. సెక్టార్లలో ఆటో, ఎఫ్ఎంసీజీ, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ ఒక్కోటి 0.5 నుంచి ఒకశాతం శాతం పెరిగాయి. మెటల్ ఇండెక్స్ దాదాపు ఒకశాతం పతనమైంది. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి.