Stock Market Close | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాల నేపథ్యం మార్కెట్లు నష్టాల్లో కొనసాగాయి. పలు బ్యాంకులకు చెందిన షేర్లు కొనుగోళ్లు భారీగా జరుగడంతో సెన్సెక్స్ చివరకు కోలుకొని లాభాల్లో ముగిసింది. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ ఇవాళ 71,035.25 పాయింట్లతో నష్టాల్లో ప్రారంభమైంది. ఒక దశలో 70,809.84 పాయింట్ల కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. చివరి సెషన్లో 71,938.59 పాయింట్ల గరిష్ఠానికి చేరింది. చివరకు 267.64 పాయింట్ల లాభంతో 71,822.83 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ సైతం 96.70 పెరిగి 21,840 వద్ద ముగిసింది. 1,948 షేర్లు పురోగమించగా.. 1,361 షేర్లు పతనమయ్యాయి. మరో 73 షేర్లు మారలేదు. నిఫ్టీలో బీపీసీఎల్, ఎస్బీఐ, కోల్ ఇండియా, ఒఎన్జీసీ, యాక్సిస్ బ్యాంక్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. టెక్ మహీంద్రా, సిప్లా, సన్ ఫార్మా, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ నష్టపోయాయి. సెక్టోరల్లో పీఎస్యూ బ్యాంక్, ఆయిల్, గ్యాస్ సూచీలు ఒక్కొక్కటి 3శాతం పెరిగాయి. ఆటో, బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్, మెటల్, పవర్, రియల్టీ ఒక్కొక్కటి 1.2 శాతం దాకా పెరిగాయి. మరోవైపు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా సూచీలు ఒక్కోశాతం చొప్పున క్షీణించాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు ఒక శాతం చొప్పున పెరిగాయి.