Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అమ్మకాల ఒత్తిడితో స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాలయ్యాయి. సెన్సెక్ 72వేల పాయింట్లకు దిగజారి.. నిఫ్టీ 22వేలకు పతనమైంది. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ బుధవారం లాభాలతో 73,993.40 పాయింట్ల వద్ద మొదలైంది. సూచీలు గరిష్ఠ స్థాయిలో కొనుసాగుతుండడంతో మదుపరులు అమ్మకాలకు దిగారు. దాంతో సూచీలు ఒక్కసారిగా ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ప్రారంభంలో 74,052.75 పాయింట్లకు పెరగ్గా.. ఇంట్రాడేలో 72,515.71 పాయింట్ల కనిష్ఠానికి చేరింది. చివరకు 906.07 పాయింట్ల నష్టంతో 72,761.89 వద్దకు పడిపోయింది.
నిఫ్టీ సైతం 338 పాయింట్లు పతనమై.. 21,997.70 పాయింట్ల వద్ద దిగజారింది. ట్రేడింగ్లో దాదాపు 290 షేర్లు పురోగమించగా.. 3,202 షేర్లు పతనమయ్యాయి. 38 షేర్లు మారలేదు. నిఫ్టీలో అత్యధికంగా వాటిలో అదానీ ఎంటర్ప్రైజెస్, కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ నష్టపోయాయి. ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ లాభపడ్డాయి. రియాల్టీ, మీడియా, పీఎస్యూ బ్యాంక్, టెలికాం, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్స్ 4-6 శాతం పతనంకావడంతో అన్ని ఇతర రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈలో మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు 4-5 శాతం పడిపోయాయి. మదుపర్ల సంపదగా భావించే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువమొత్తం రూ. 13 లక్షల కోట్లు ఆవిరైంది.