Stock Closing Bell | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 523, నిఫ్టీ 166 పాయింట్లు పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలకు తోడు సానుకూల ప్రభావం చూపే అంశాలు లేకపోవడం నష్టాలకు కారణమయ్యాయి. ఐటీ, ఫార్మా పేర్లను మినహాయించి అన్ని రంగాల్లో అమ్మకాల మధ్య సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఇవాళ ఉదయం సెన్సెక్స్ 71,722.31 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఆ తర్వాత బ్యాంకింగ్ సెక్టార్తో పాటు వివిధ రంగాల్లోని షేర్లు అమ్మకాలతో మార్కెట్కు ఒత్తిడికి గురైంది. ఒక దశలో 71,756.58 పాయింట్ల గరిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. ఇంట్రాడేలో 70,922.57 కనిష్ఠానికి చేరింది. చివరకు 523 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 71,072.49 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ సైతం 166.45 పాయింట్లు పతనమై.. 21,616.05 వద్ద ముగిసింది. దాదాపు 791 షేర్లు పురోగమించగా.. 2618 షేర్లు పతనమయ్యాయి. 66 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో కోల్ ఇండియా, హీరో మోటోకార్ప్, బీపీసీఎల్, ఓఎన్టీసీ, ఎన్టీపీసీ టాప్ లూజర్స్గా నిలిచాయి. డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, అపోలో హాస్పిటల్స్, విప్రో, డివిస్ ల్యాబ్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే ఎఫ్ఎంసీజీ, సీఎస్యూ బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, రియల్టీ ఒక్కొక్కటి ఒకటి నుంచి నాలుగు శాతం చొప్పున క్షీణించాయి. హెల్త్కేర్, ఐటీ, సూచీలు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 2.6 శాతం, స్మాల్క్యాప్ ఇండెక్స్ 3శాతం పడిపోయాయి.