Deepak Parekh | దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ దీపక్ పరేఖ్.. కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తాను 65వ పడిలో పడినప్పుడు దీపక్ పరేఖ్.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా తప్పుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. తన జీవితంలో ఇది అత్యంత కష్టమైన, క్లిష్టమైన నిర్ణయం అని పేర్కొన్నారు.
ముంబైలో జరుగుతున్న గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్-2023లో ఆయన ఈ సంగతి చెప్పారు. ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాలో కొనసాగాలని హెచ్డీఎఫ్సీ బ్యాంకు డైరెక్టర్ల బోర్డు కోరినా.. ఫుష్కలంగా ఉన్న భవిష్యత్ అవకాశాలు క్రియేట్ చేయడానికి రిటైర్ కావడం తప్ప మరో చాయిస్ లేదని చెప్పారాయన.
నా కుటుంబ సభ్యుల ఆకాంక్షల మేరకు, పలు విధాలుగా ఆలోచించిన తర్వాత 65వ ఏటా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చైర్మన్గా వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. గత 13 ఏండ్లుగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎటువంటి వేతనం తీసుకోలేదు. స్టాక్ ఆప్షన్లు కూడా ఎంచుకోలేదు. తనతోపాటు 20-30 ఏండ్ల పాటు కలిసి పని చేసిన సహచరులు బోలెడు స్టాక్ ఆప్షన్లు ఎంచుకున్నారని తెలిపారు దీపక్ పరేఖ్.