బెంగళూర్ : సంభవ్ జైన్, కుష్ తనేజా స్ధాపించిన బెంగళూర్కు చెందిన ఫిన్టెక్ యాప్ ఫ్యామ్ పలువురు ఉద్యోగులను విధుల నుంచి (Layoffs) తొలగించింది. వేటుకు గురైన 18 మంది ఉద్యోగులకు మరో చోట ఉపాధి లభించేలా బాధిత ఉద్యోగులకు సహకరిస్తామని కంపెనీ వ్యవస్ధాపకులు పేర్కొన్నారు. ఫ్యామ్ వంటి ఉద్యోగులను ఆదరించే సంస్ధ సిబ్బందిని తొలగించడం బాధాకరమని, వీరి పట్ల కంపెనీ సానుభూతితో వ్యవహరిస్తుందని వారు వృత్తిపరంగా ఎదిగేందుకు, మరో ఉద్యోగంలో కుదురుకునేందుకు సహకరిస్తుందని ఫౌండర్ సంభవ్ జైన్ ట్వీట్ చేశారు.
కంపెనీ ఎదుగుదల కోసం వీరంతా కష్టపడి పనిచేశారని, వీరిని వదులుకోవడం విచారకరమైన కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తనేజా ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. తమ టీమ్ల్లో నైపుణ్యం కలిగిన వ్యక్తుల కోసం అన్వేషించే సంస్ధలు తమ ఉద్యోగులను నియమించుకోవాలని తనేజా రిక్రూటర్లకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఫౌండర్ల ట్వీట్పై యూజర్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది.
ఓవైపు లేఆఫ్స్కు దిగుతూ మరోవైపు తాము ఉద్యోగుల పక్షమని ఎలా చెబుతారని పలువురు ట్విట్టర్ యూజర్లు ప్రశ్నించారు. ఉద్యోగుల పట్ల ఏ కంపెనీ అయినా సానుభూతితో వ్యవహరిస్తే ఇలాంటి సంక్లిష్ట సమయంలో వారిని విధుల నుంచి తొలగించదని మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More :
India Post Recruitment | పదోతరగతి అర్హతతో.. పోస్టల్ శాఖలో 30,041 పోస్టులు