హైదరాబాద్, మార్చి 11: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ యమహా మోటర్..ఉగాది పండుగను దృష్టిలో పెట్టుకొని ఎంపిక చేసిన స్కూటర్లు, మోటర్సైకిళ్లపై ప్రత్యేక తగ్గింపు ధరలతో విక్రయించనున్నట్టు ప్రకటించింది.
ఆర్15 సిరీస్ వాహనాలపై రూ.6 వేల వరకు తగ్గింపునిస్తున్న సంస్థ..రేజెడ్ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్ మాడల్పై రూ.7 వేల ప్రయోజనాలు, ఫాస్కినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్ను రూ.4,999 డౌన్పేమెంట్ చేసి కొనుగోలు చేయవచ్చునని తెలిపింది. అలాగే ఎఫ్జెడ్-ఎస్ ఎఫ్ఐ హైబ్రిడ్ను రూ.7,999 ముందస్తుగా చెల్లించి కొనుగోలు చేయవచ్చునని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.