బెంగళూరు, సెప్టెంబర్ 17: దేశంలో అతిపెద్ద ఆన్లైన్ ఫ్యాషన్ ఈ-రిటైలర్ ఏజియో మరోసారి ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఈ నెల 25 వరకు అమలులో ఉండనున్న ఈ ప్రత్యేక ఆఫర్ల కింద 3,500కిపైగా దేశీయ, అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్లపై 50 శాతం నుంచి 90 శాతం వరకు రాయితీ ఇస్తున్నది. యాప్ ద్వారా తొలిసారిగా కస్టమర్ బుకింగ్ చేసుకున్న ఆర్డర్పై రూ.500 ఇన్స్టాంట్ రాయితీ కూడా కల్పిస్తున్నట్టు ఏజియో తెలియజేసింది.