Sovereign Gold Bond | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండో సిరీస్ సావరిన్ గోల్డ్ బాండ్ స్కీం (ఎస్జీబీస్) సోమవారం ప్రారంభం కానున్నది. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు మీరు సావరిన్ బంగారం బాండ్లు కొనుగోలు చేయొచ్చు. బాండ్ల కొనుగోలుకు ఒక గ్రామ్ బంగారం విలువ రూ.5,293గా ఆర్బీఐ నిర్ణయించింది. ఆఫ్లైన్ లేదా ఆన్లైన్లోనూ బాండ్ల కొనుగోలు కోసం దరఖాస్తు చేయవచ్చు.
ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటే రూ.50 రాయితీ లభిస్తుంది. దీని ప్రకారం గ్రామ్ బంగారం బాండ్పై రూ.5873 లెక్క గడతారు. సావరిన్ బంగారం బాండ్లలో 24 క్యారట్ల బంగారం (99.9 స్వచ్ఛత)పై పెట్టుబడి పెట్టినట్లే.
సావరిన్ గోల్డ్ బాండ్ అంటే ప్రభుత్వం విక్రయించే బాండ్. దీన్ని డీమ్యాట్ ఖాతాలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఐదు గ్రాముల బంగారం విలువ గల బాండ్లు కొనుగోలు చేస్తే దాని విలువ గల బాండ్లను ఆర్బీఐ జారీ చేస్తుంది. సావరిన్ గోల్డ్ బాండ్పై వార్షిక ప్రాతిపదికన 2.5 శాతం వడ్డీ రిటర్న్స్ వస్తాయి. తర్వాత మనీ అవసరమైతే.. ఇదే సావరిన్ గోల్డ్ బాండ్లపై రుణం కూడా తీసుకోవచ్చు.