Sovereign Gold | బంగారం కొనుక్కోవాలని భావిస్తున్నారా.. ఫిజికల్ గోల్డ్తోపాటు అంతే విలువ గల బాండ్లు కూడా కొనుగోలు చేయొచ్చు. అందుకోసం భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) .. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండో దశ గోల్డ్ బాండ్ స్కీమ్ జారీ చేస్తున్నది. ఈ మేరకు సావరిన్ పసిడి బాండ్ల తేదీలను ఆర్బీఐ ప్రకటించింది. ఈ నెల 11 నుంచి 15 వరకు దరఖాస్తు చేసుకున్న వారికి బాండ్లు జారీ చేస్తుంది.
తాజాగా జారీ చేయనున్న బంగారం సావరిన్ బాండ్ ‘గ్రామ్’ ఇష్యూ ధర రూ.5,923గా ఆర్బీఐ నిర్ణయించింది. ఆన్లైన్లో బాండ్లు కొనుగోలు చేసే వారికి గ్రామ్పై రూ.50 రాయితీతో జారీ చేసే ఇష్యూ ధర రూ.5873 అవుతుంది.
బంగారం కొనుగోళ్లను తగ్గించడానికి 2015 నవంబర్లో కేంద్రం ఈ పథకం తెచ్చింది. బాండ్ల సబ్స్క్రిప్షన్కు ముందు వారంలో చివరి మూడు రోజుల్లో 24 క్యారట్ల బంగారంపై ఇండియన్ బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేసన్ నిర్ణయించిన సగటు ధరపై గ్రామ్ బంగారం ధర ఆర్బీఐ ఖరారు చేస్తుంది.
గోల్డ్ సావరిన్ బాండ్లు కొనుగోలు చేసేవారు ఒక గ్రామ్ – ఒక యూనిట్ కింద కొనుగోలు చేయాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు అత్యధికంగా నాలుగు కిలోలు, ట్రస్టులు 20 కిలోల వరకూ కొనుగోలు చేయొచ్చు.
ఈ బాండ్ గడువు ఎనిమిదేండ్లు ఉంటుంది. ఐదేండ్ల తర్వాత అవసరమనుకుంటే బాండ్ల కొనుగోలుదారులు తప్పుకోవచ్చు. ఫిజికల్ గోల్డ్ కొనుగోలుకు అమలులో ఉన్న ‘కేవైసీ’ నిబంధనలే బాండ్ల కొనుగోలుకు కూడా వర్తి్స్తాయి.