న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: ఆహార పదార్థాల డెలివరీ సంస్థ స్విగ్గీలోకి పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. తాజాగా సాఫ్ట్బ్యాంక్ కూడా 450 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు స్విగ్గీతో చర్చలు జరుపుతున్నది. ఈ చర్చలు చివరి దశకు చేరుకున్నాయి. మన కరెన్సీలో ఇది రూ.3,348 కోట్లు. బెంగళూరు కేంద్రస్థానంగా సేవలు అందిస్తున్న స్విగ్గీ ప్రస్తుత విలువ 5 బిలియన్ డాలర్లు. సంస్థలోకి గతంలోనే ఫాల్కన్ ఎడ్జ్ క్యాపిటల్, అమాన్సా క్యాపిటల్, థింక్ ఇన్వెస్ట్మెంట్, కార్మైగ్నాక్, గోల్డ్మన్ శాక్స్లు సంయుక్తంగా 800 మిలియన్ డాలర్లు(రూ.5,862 కోట్లు) పెట్టుబడి పెట్టిన విషయం తెలిసిందే. కంపెనీ కో-ఫౌండర్, సీఈవో శ్రీ హర్ష.. ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్తో ఈ ఒప్పందం బయటకు పొక్కింది.
ఇవీ కూడా చదవండీ…
చౌక వడ్డీకే బంగారం లోన్.. ఈ బ్యాంకుల్లోనే..!