శేరిలింగంపల్లి, జూన్ 23: ఎస్ఎంఆర్ హోల్డింగ్ సంస్థ కొండాపూర్లోని తమ వినయ్ ఐకానియాలో మరో మూడు కొత్త టవర్లను ప్రారంభించింది. సకల సదుపాయాలతో కూడిన ఈ అపార్ట్మెంట్లను సంస్థ ఎండీ ఎస్ రాంరెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎమిల్టన్ టవర్ 80 శాతం, లోగన్ టవర్ 60 శాతం, శివాలిక్ టవర్ 30 శాతం పూర్తయ్యాయని వివరించారు.
ఈ ప్రాజెక్టులో ఇప్పటికే మూడు దశలు పూర్తయ్యాయని, దాదాపు 1,100 ఫ్లాట్లు వినియోగదారులకు అందజేసినట్టు చెప్పారు. ఈ మూడు కొత్త టవర్ల ద్వారా మరో 1,258 యూనిట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించామని, ముఖ్యంగా 40 పడకల దవాఖానను సైతం ఈ ప్రాజెక్టులో తొలిసారిగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు
. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ది చెందుతున్నదని కొనియాడారు. ఎస్ఎంఆర్ ఈడీ పృథ్వీరాజ్రెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్ సందీప్రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.