న్యూఢిల్లీ, డిసెంబర్ 31: చిన్న మొత్తాలపై వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో జనవరి 1 నుంచి మార్చి 31 వరకు చిన్న మొత్తాలపై వడీరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.
ఈ విషయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా నోటిఫికేషన్లో వెల్లడించింది. నాలుగు త్రైమాసికాలుగా వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవడం విశేషం. సుకన్య సమృద్ధి స్కీం కింద డిపాజిట్లపై 8.2 శాతం వడ్డీరేటును ఆఫర్ చేస్తున్న కేంద్రం..పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్) 7.1 శాతం, పోస్టాఫీస్ పొదుపు డిపాజిట్ స్కీంలపై 4 శాతం వడ్డీని, కిసాన్ వికాస్ పత్రాలపై 7.5 శాతం వడ్డీని చెల్లిస్తున్నది.