హైదరాబాద్ : ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా ఇటీవల 2021 నవంబర్ అమ్మకాల నివేదికలను విడుదల చేసింది. నవంబర్ నెలలో మొత్తం 2,196 యూనిట్లను విక్రయించినట్లు ఆ సంస్థ తెలిపింది. అయితే ఇదే నెల గతేడాది కేవలం 1,056 యూనిట్లను మాత్రమే విక్రయించింది. దీన్ని బట్టి చూస్తే సంస్థ అమ్మకాలు లాస్ట్ ఇయర్ కంటే ఏకంగా 108 శాతం పెరిగాయి. స్కోడా మొత్తం అమ్మకాలలో ఒక్క స్కోడా కుషాక్ మాత్రమే 2,300 యూనిట్స్ సేల్ అయ్యాయి. కంపెనీ అమ్మకాలు పెరగడానికి ఈ కుషాక్ ఎస్ యువీ కీలకపాత్రపోషించింది. వినియోగదారులకు తమ అభిరుచులకు తగిన విధంగా సరికొత్త ఫీచర్ల తో కొత్త వాహనాలను అందిస్తోంది స్కోడా.
స్కోడా ఇటీవల చెన్నై, హైదరాబాద్, పాండిచ్చేరి ,సికింద్రాబాద్ వంటి ప్రధాన నగరాలలో తమ కొత్త డీలర్షిప్లను కూడా ప్రారంభించింది. స్కోడా కొత్త మోడళ్లకు దేశీయ మార్కెట్లో మంచి స్పందన ఉన్నది. దీంతో స్కోడా తన నెట్వర్క్ను చాలా వేగంగా విస్తరిస్తోంది. కంపెనీ అమ్మకాలు గణనీయంగా పెరగడానికి ప్రధాన కారణం స్కోడా కుషాక్. స్కోడా కుషాక్ అన్ని వేరియంట్లు మంచి ఆదరణ పొందుతున్నాయి. దీంతో అమ్మకాల విషయంలో ముందుకు దూసుకెళ్తోంది. ప్రస్తుత ఆటో మొబైల్ పరిశ్రమ సెమికండక్టర్ చిప్ కొరతతో సతమతమవుతోంది. ఇది కంపెనీ ఉత్పత్తులను, అమ్మకాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. స్కోడా ఆటో ఇండియా ఈ ఏడాది భారతదేశంలో 30వేల కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతే కాకుండా వచ్చే 2022 చివరి నాటికి భారతదేశంలో 60వేల కార్లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.