న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో నెలకొన్న అనవసరపు సంక్లిష్టతను రాబోయే కొత్త ప్రభుత్వం తక్షణమే తొలగించాల్సిన అవసరం ఉందని ప్రముఖ ఆర్థికవేత్త, 13వ ఆర్థిక సంఘం చైర్మన్ విజయ్ కేల్కర్ అన్నారు.
దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగనున్న క్రమంలో సరళతరమైన జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. 12 శాతం సింగిల్ ట్యాక్స్ రేటు ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వాలు, మున్సిపల్ కార్పొరేషన్లతో జీఎస్టీ ఆదాయాన్ని కేంద్రం పంచుకోవాలని సూచించారు.