సింగపూర్, జూలై 27: హైదరాబాద్తోపాటు బెంగళూరు, చెన్నైల నుంచి సింగపూర్కు సింగపూర్ ఎయిర్లైన్స్తోపాటు స్కూట్ ఎయిర్లైన్స్లు తిరిగి తమ విమాన సేవలను ప్రారంభించబోతున్నాయి. అక్టోబర్ 29 నుంచి ఈ రూట్లలో విమాన సర్వీసులను నడపనున్నట్లు ఇరు సంస్థలు ప్రకటించాయి. అలాగే సింగపూర్-హైదరాబాద్ మధ్య సింగపూర్ ఎయిర్లైన్స్ వారానికి ఏడు సర్వీసులు నడుపనుండగా.. ఈ సంఖ్యను 12కి పెంచుకోనున్నది. అలాగే స్కూట్ సంస్థ రోజుకు ఒక్కో విమాన సర్వీసును నడుపుతున్నది.