న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: వెండి ధర మరింత తగ్గింది. సోమవారం ఢిల్లీ స్పాట్ మార్కెట్లో కిలో విలువ రూ.5,000 దిగి రూ.2,50,000 (అన్ని పన్నులతో సహా) వద్ద స్థిరపడింది. కాగా, మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతుండటం వల్లే ఈ ధరల పతనమని మార్కెట్ నిపుణులు తాజా ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు.
మరోవైపు 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల బంగారం రేటు రూ.700 పెరిగి రూ.1,59,200 పలికింది. దీంతో సెంట్రల్ బ్యాంకులు పసిడి నిల్వలను పెంచుకుంటుండటం, టెక్నాలజీ-ఏఐ స్టాక్స్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా మదుపరులు తమ పెట్టుబడుల రక్షణార్థం పుత్తడి వైపునకు పరుగులు పెడుతుండటం ఇందుకు కారణంగా బులియన్ వర్గాలు చెప్తున్నాయి.
ఇక హైదరాబాద్ మార్కెట్ విషయానికొస్తే.. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) తులం ధర రూ.1,43,400గా ఉన్నది. ఇదిలావుంటే అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు 40.10 డాలర్లు దిగజారి 5,003.01 డాలర్లకు చేరింది. అలాగే సిల్వర్ 76.94 డాలర్లుగా ఉన్నది.