ముంబై: ఇండియన్ స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్( Sensex ) వరుసగా మూడో రోజు కూడా జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. బుధవారం ఉదయం 143 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్.. 56,102 పాయింట్ల మార్కును అందుకుంది. అటు నిఫ్టీ కూడా 142 పాయింట్లు లాభపడి 16,676 మార్క్ను తాకింది. ఇండియాతో సహా మిగతా ఆసియా మార్కెట్లు కూడా బుధవారం సానుకూలంగా ప్రారంభమయ్యాయి.
సెన్సెక్స్లో బజాజ్ ఎలక్ట్రికల్ గెయినర్స్ లిస్ట్లో టాప్లో ఉండగా.. బ్లూస్టార్ షేర్లు కూడా బాగానే లాభపడ్డాయి. మరోవైపు నిఫ్టీలో టాటా మోటార్స్ టాప్ గెయినర్గా ఉంది. ఈ కంపెనీ షేరు 6.9 శాతం లాభపడింది. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూలాంశాలు మన మార్కెట్లకు కలిసొచ్చాయి. ఇక ఇండియాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమవుతుండటం, కరోనా కేసులు తగ్గిపోవడం కూడా మార్కెట్లలో ఉత్సాహం నింపింది.