న్యూఢిల్లీ, మార్చి 16: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్.. దేశీయ మార్కెట్లోకి ఒకేసారి మూడు మోడళ్ళను తీసుకొచ్చింది. వీటిలో ఈ-క్లాస్ 200 పెట్రోల్, డబ్ల్యూ 220డీ డీజిల్, 350 డీ డీజిల్ కార్లు ఉన్నాయి. మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఈ-క్లాస్ విభాగంలో విడుదల చేసిన ఈ కార్లు రూ.63.60 లక్షల నుంచి రూ.80.90 లక్షల మధ్యలో లభించనున్నాయి. భారతీయ కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని ఈ కారు ఇంటీరియర్లో పలు మార్పులు చేసినట్లు మెర్సిడెజ్ బెంజ్ తెలిపింది. కేవలం 7.6 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ మోడళ్ళను 2 లీటర్ల పెట్రోల్, డీజిల్ ఇంజిన్తో తయారుచేసింది.