Stocks | మకర సంక్రాంతి రోజు సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు పాజిటివ్గా ముగిశాయి. ఐటీ స్టాక్స్ దన్నుతో తాజా కొత్త రికార్డులు నమోదు చేశాయి. ఇంట్రాడే ట్రేడింగ్లో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 73 వేల మార్కును దాటేసింది. 73,402 పాయింట్ల గరిష్టానికి దూసుకెళ్లి.. ట్రేడింగ్ ముగిసే సమయానికి 759 పాయింట్ల లబ్ధితో 73,329 పాయింట్ల (1.05 శాతం) లబ్ధితో స్థిర పడింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ సైతం ఇంట్రాడే ట్రేడింగ్లో 22 వేల మార్క్ను దాటుకుని 22,116 పాయింట్ల గరిష్ట రికార్డు నమోదు చేసింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 203 పాయింట్ల (0.93 శాతం0 లాభంతో 22,097 పాయింట్ల వద్ద ముగిసింది.
ఐటీ దిగ్గజం విప్రో షేర్ ఇంట్రాడే ట్రేడింగ్లో 14 శాతం పుంజుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో మార్కెట్ అంచనాలను మించి నికర లాభాలు గడించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో ట్రేడింగ్ ముగిసే సమయానికి ఆరు శాతం లబ్ధితో స్థిర పడింది. దీంతోపాటు హెచ్సీఎల్ టెక్, భారతీ ఎయిర్ టెల్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ, మారుతి సుజుకి, హెచ్యూఎల్, టైటాన్, ఎస్బీఐ, ఇండస్ ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టీసీఎస్ 0.6 శాతం నుంచి మూడు శాతం మధ్య స్థిర పడ్డాయి.
బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 38,162 పాయింట్లతో నూతన రికార్డు నమోదు చేసింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 44,872 పాయింట్లను తాకింది. ఇండెక్స్లు 0.67 నుంచి 0.11 శాతం మధ్య లబ్ధి పొందాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ రెండుశాతం, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, బ్యాంక్ ఇండెక్స్లు లాభ పడ్డాయి.