ముంబై: బుల్ మార్కెట్లు పరుగులు తీశాయి. ఇవాళ సెన్సెక్స్(Sensex), నిఫ్టీలు రికార్డు క్రియేట్ చేశాయి. సెన్సెక్స్ 72,720 పాయింట్ల వద్ద ట్రేడింగ్ జరిగింది. నిఫ్టీ కూడా కొత్త రికార్డు నమోదు చేసింది. నిఫ్టీ 21,928 పాయింట్ల వద్ద ట్రేడ్ అయ్యింది. సెన్సెక్స్ ఇవాళ ఒక్క రోజే 950 పాయింట్లు ట్రేడ్ అయ్యింది. ఐటీ కంపెనీల్లో భారీ స్థాయిలో షేర్లు పెరిగినట్లు ట్రేడింగ్లో తెలిసింది. ఇన్ఫోసిస్ షేర్లు 8 శాతం పెరిగాయి. డిసెంబర్ త్రైమాసికంలో ప్రదర్శన బాగుండంతో ఆ లాభం జరిగింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ షేర్లు 4 శాతం వృద్ధి సాధించాయి. టెక్ మహేంద్ర, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎస్బీఐ కూడా ఉత్తమ ప్రదర్శన ఇచ్చాయి.