ముంబై, ఆగస్టు 23: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో కళకళలాడుతున్నాయి. యూరోపియన్ స్టాక్ల నుంచి లభించిన మద్దతుకు తోడు బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు జరపడంతో సూచీలు లాభాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో 284.68 పాయింట్లు లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ చివరకు 213.27 పాయింట్ల లాభంతో 65,433.30 వద్ద స్థిరపడింది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ 47.55 పాయింట్లు అందుకొని 19,444 వద్ద ముగిసింది. గత మూడు సెషన్లలో సెన్సెక్స్ 484.64 పాయింట్లు, నిఫ్టీ 133.85 పాయింట్లు ఎగబాకింది.
మార్కెట్లో ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, ఎల్అండ్టీ, మారుతి, టాటా స్టీల్, కొటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, నెస్లె, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్లు లాభాల్లో ముగిశాయి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, భారతీ ఎయిర్టెల్, టాటా మోటర్స్, టెక్ మహీంద్రా, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, మహీంద్రా అండ్మహీంద్రాలు నష్టపోయాయి. చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండ్ కావడంతో ఏరోస్పేస్, రక్షణ రంగ షేర్లు భారీగా పుంజుకున్నాయి. ఈ రంగ షేర్లు మూడు శాతం వరకు పెరిగాయి. రంగాలవారీగా చూస్తే బ్యాంకింగ్ 1.20 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.16 శాతం, ఇండస్ట్రీయల్స్ 1.08 వాతం, మెటల్ 1.05 శాతం, ఆర్థిక సేవల రంగ షేర్లు లాభాల్లో ముగిశాయి. కానీ, యుటిలిటీ, వాహన, చమురు అండ్ గ్యాస్, పవర్, సేవల రంగ షేర్లు నష్టపోయాయి.
దేశీయంగా సెంటిమెంట్ పాజిటివ్గా ఉన్నది. బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో సూచీలు బలోపేతం అయ్యాయి.
– వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్షియల్ హెడ్