ముంబై, నవంబర్ 30: దేశీయ స్టాక్ మార్కెట్ల లాభాల జోరు కొనసాగుతున్నది. వరుసగా ఏడు రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న సూచీలు రికార్డు స్థాయిలో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల వార్తలకు తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను కుమ్మరించడంతో బీఎస్ఈ సెన్సెక్స్ తొలిసారిగా 63 వేల పైకి చేరుకున్నది. దేశ ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయన్న అంచనాలతో మదుపరుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ఫలితంగా ఎగబడి కొనుగోళ్ళు జరపడంతో సెన్సెక్స్ సూచీ మరో చారిత్రక గరిష ్ఠ స్థాయికి చేరుకున్నది. మార్కెట్ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 417.81 పాయింట్లు లాభపడి 63,099.65 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ చరిత్రలో ఇంతటి గరిష్ఠ స్థాయిలో ముగియడం ఇదే తొలిసారి. ఇంట్రాడేలో సూచీ 621.17 పాయింట్లు లాభపడి 63,303.01 స్థాయికి చేరుకున్నది. చివర్లో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో భారీ లాభాలను నిలుపుకోలేకపోయింది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 140.30 పాయింట్లు అందుకొని 18,758.35 వద్ద స్థిరపడింది.
దేశీయ మార్కెట్లు వరుసగా లాభాల్లో కొనసాగుతున్నాయి. ఎఫ్ఐఐలు నిధులు కుమ్మరించడం, చైనాలో కరోనా మరోసారి విజృంభిస్తుండటం కూడా మార్కెట్లకు దన్నుగా నిలిచాయి.
– వినోద్ నాయర్, జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్
288 లక్షల కోట్లకు బీఎస్ఈ లిస్టడ్
బీఎస్ఈలో లిైస్టెన సంస్థల విలువ రికార్డు స్థాయికి చేరుకున్నది. సూచీలు ఆల్టైం-హైకి చేరుకోవడంతో బీఎస్ఈలో లిైస్టెన సంస్థల విలువ రూ.288.50 లక్షల కోట్లకు చేరుకున్నది. గత ఏడు సెషన్లలో బీఎస్ఈ సెన్సెక్స్ 1,954.81 పాయింట్లు ఎగబాకడంతో మదుపరుల సంపద రూ.7,59,64 2.89 కోట్లు పెరిగి రూ.2,88,50, 896.03 కోట్లకు చేరుకున్నది.
సెన్సెక్స్ కదలికలు గత ముగింపు
62,681.84
ప్రారంభం
62,743.47
గరిష్ఠ స్థాయి
63,303.01
కనిష్ఠ స్థాయి
62,648.38
ముగింపు
63,099.65