ముంబై, అక్టోబర్ 5: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వచ్చినప్పటికీ ఐటీ, ఇంధనం, బ్యాంకింగ్ రంగాల షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో సూచీలు లాభాల్లో ముగిశాయి. బలహీనంగా ప్రారంభమైనప్పటికీ మధ్యాహ్నాం తర్వాత మదుపరులు ఎగబడి కొనుగోళ్ళు జరుపడంతో 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 445.56 పాయింట్లు లాభపడి 59,744.88 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ కూడా 131.05 పాయింట్లు అందుకొని 17,822.30 పాయింట్ల వద్ద ముగిసింది.
2 రోజుల్లో 5 లక్షల కోట్లు పెరిగిన సంపద
స్టాక్ మార్కెట్లు దూసుకుపోతుండటంతో మదుపరులు లాభాల జడివానలో తడిసి ముద్దవుతున్నారు. వరుసగా రెండోరోజు సెన్సెక్స్ భారీ లాభాల్లో ముగియడంతో ఈక్విటీ పెట్టుబడిదారుల సంపద అమాతం పెరిగింది. ఈ రెండు రోజుల్లో మదుపరుల సంపద రూ.5.17 లక్షల కోట్ల మేర పెరిగి బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రికార్డు స్థాయికి చేరుకున్నది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,17,836 కోట్లు పెరిగి రూ.2,64,78,332.22 కోట్లకు చేరుకున్నది.