ముంబై, మార్చి 6: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. ఐటీ, ఆర్థిక, వాహన రంగ షేర్లకు లభించిన మద్దతుకుతోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో సెన్సెక్స్ తిరిగి 60 వేల మార్క్ను అధిగమించింది. ఇంట్రాడేలో 700 పాయింట్ల వరకు లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 415.49 పాయింట్ల లాభంతో 60,224.46 వద్ద స్థిరపడింది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ 117.10 పాయింట్లు అందుకొని 17,711. 45 వద్ద ముగిసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోవడంతో పెట్టుబడిదారుల్లో సెంటిమెంట్ మెరుగుపడింది. ఫలితంగా కొనుగోళ్లకు మొగ్గుచూపారు.
నేడు సెలవు
హోలీ సందర్భంగా మంగళవారం స్టాక్ మార్కెట్లు మూసివేసివుంచనున్నారు. తిరిగి బుధవారం యథాతథంగా పనిచేయనున్నాయి.