ముంబై, జూలై 11: అంతర్జాతీయ మార్కె ట్ల నుంచి వచ్చిన దన్నుతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి పుంజుకున్నాయి. ఇంట్రాడేలో 500 పా యింట్లకు పైగా ర్యాలీ జరిపిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 273.67 పాయింట్లు లాభపడి 65,617.84 వద్ద స్థిరపడింది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 83.50 పాయింట్లు అందుకొని 19,439.40 వద్ద ముగిసింది.