Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. వారంలో తొలిరోజైన సోమవారం సూచీలు జీవితకాల గరిష్ఠాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 76వేల మార్క్ను అధిగమించింది. నిఫ్టీ సైతం అదే ఊపును కొనసాగిస్తూ 23వేల మార్క్ను దాటింది. మార్కెట్లు గరిష్ఠానికి చేరిన నేపథ్యంలో మదుపరులు కొనుగోళ్లకు దిగడంతో స్వల్ప నష్టాల్లో ముగిశాయి. సోమవారం సెన్సెక్స్ కిత్రం సెషన్తో పోలిస్తే 75,655.46 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఆ తర్వాత మార్కెట్లలో జోరు కొనసాగిస్తూ.. ఇంట్రాడేలో 76,009.68 పాయింట్ల గరిష్ఠానికి చేరుకున్నది.
బ్యాకింగ్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగాయి. అయితే, చివరి సెషన్లో మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో ఒక్కసారిగా మార్కెట్ కుప్పకూలింది. చివరలో 75,175.27 పాయింట్ల కనిష్ఠానికి చేరుకున్నది. చివరకు 19.89 పాయింట్ల నష్టంతో 75,390.50 నష్టాల్లో ముగిసింది. నిఫ్టీలో సైతం భారీగా కొనుగోళ్లు కనిపించాయి. నిఫ్టీ ఉదయం 23,038.95 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 23,110.80 గరిష్ఠానికి చేరుకొని సరికొత్త రికార్డును నెలకొల్పింది.
చివరి సెషన్లో పాయింట్ల 22,871.20 కనిష్ఠానికి చేరింది. చివరకు 24.65 పాయింట్ల నష్టంతో 22,932.45 వద్ద ముగిసింది. మార్కెట్లో దాదాపు 1,599 షేర్లు పురోగమించగా.. 1868 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో దివిస్ ల్యాబ్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎల్టీఐఎండ్ట్రీ, అదానీ పోర్ట్లు అత్యధికంగా లాభపడ్డాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, విప్రో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నష్టపోయాయి. సెక్టోరల్లో బ్యాంక్, రియల్టీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సూచీలు ఒక్కొక్కటి 0.5 శాతం లాభపడగా.. ఆయిల్, గ్యాస్, పవర్, మీడియా 0.5 నుంచి ఒక శాతం వరకు పతనమయ్యాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం లాభపడగా.. స్మాల్క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్గా ముగిసింది.