Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ ఫలితాల మధ్య బెంచ్ మార్క్ సూచీలు నష్టాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 71,022.10 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలవగా.. ఆ తర్వాత సూచీలు కోలుకున్నాయి. అయితే, ఐటీరంగ షేర్లలో గరిష్ఠంగా అమ్మకాలు నమోదయ్యాయి. ఎఫ్ఎంసీజీ, ఫార్మారంగ షేర్లు సైతం మార్కెట్పై ఒత్తిడి పెంచాయి. చివరి సెషన్లో కోలుకున్నారు. సెన్సెక్స్ ఒక దశలో 70,319.04 పాయింట్ల కనిష్ఠానికి చేరగా.. 71,049.46 గరిష్ఠానికి నమోదు చేసింది.
చివరకు 359.64 పాయింట్ల నష్టంతో 70,700.67 వద్ద ముగిసింది. 101.35 పాయింట్ల నష్టంతో 21,352.60 పాయింట్ల వద్ద స్థిరపడింది. దాదాపు 1,813 షేర్లు పురోగమించగా.. 1,423 షేర్లు పతనమయ్యాయి. 55 షేర్లు మాత్రం మారలేదు. ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా, బ్యాంక్, ఐటీ, ఎఫ్ఎంసీజీ, హెల్త్కేర్ ఇండెక్స్ అన్నీ ఒక శాతానికిపైగా పతనమయ్యాయి. నిఫ్టీలో బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్ లాభాల్లో ముగిశాయి. టెక్ మహీంద్రా, సిప్లా, భారతీ ఎయిర్టెల్, ఎల్టీఐమైండ్ట్రీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్ నష్టాల్లో ముగిశాయి.