Mercedes Benz | కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి మొగ్గుతున్నారు.. ఎస్యూవీలపై మోజు పెంచుకుంటున్నారు.. రోజురోజుకు కార్ల సేల్స్లో ఎస్యూవీ వాటా పెరుగుతోంది.. కానీ మెర్సిడెజ్ బెంజ్ మాత్రం డిఫరెంట్గా స్పందిస్తోంది.. మొత్తం కార్ల మార్కెట్లో ఎస్యూవీలదే పెత్తనమైనా.. సెడాన్ కార్ల మార్కెట్కు ఢోకా లేదంటున్నారు మెర్సిడెజ్ బెంజ్ ఇండియా సీఈఓ కం ఎండీ సంతోష్ అయ్యర్. ఇటీవల తాము మార్కెట్లోకి రిలీజ్ చేసిన న్యూ ‘జీఎల్సీ’ ఎస్యూవీతో మార్కెట్లో ఎస్యూవీల వాటా కాస్త ఎక్కువే అయినా సెడాన్ కార్లకూ డిమాండ్ చాలా బలంగా ఉందన్నారాయన.
ప్రస్తుతం ఎస్యూవీలు, సెడాన్ల మధ్య సేల్స్ దాదాపు 52:48 శాతం ఉంటుందని స్పష్టం చేశారు సంతోష్ అయ్యర్. తమ సంస్థ సెడాన్ – ఎస్యూవీ పోర్ట్ ఫోలియో కార్ల మధ్య సమతుల్యత పాటిస్తూ ముందుకెళ్తుందని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
మెర్సిడెజ్ బెంజ్ ఏ-క్లాస్, బీ-క్లాస్, ఈ-క్లాస్, ఎస్-క్లాస్ పేరిట సెడాన్లు, జీఎల్ఏ, జీఎల్సీ, జీఎల్ఈ, జీఎల్ఎస్ మోడల్ ఎస్యూవీ కార్లు మార్కెట్లో విక్రయిస్తోంది. జీఎల్సీ లాంచింగ్ తర్వాత తమ ఎస్యూవీ కార్ల సేల్స్ మొత్తం విక్రయాల్లో 55-57 శాతం ఉన్నాయని సంతోష్ అయ్యర్ అంగీకరించారు. అయినా మెర్సిడెజ్ బెంజ్ సెడాన్ కార్లకు గిరాకీ ఇంకా గట్టిగానే ఉందన్నారు. 2023 తొలి అర్థభాగంలో మొత్తం 8500 కార్లు విక్రయిస్తే దాదాపు 4500 మంది సెడాన్ కార్లు అమ్ముడయ్యాయన్నారు.