ముంబై, డిసెంబర్ 20: స్టాక్ ఎక్సేంజీల ద్వారా ప్రస్తుతం కంపెనీలు అమలు జరుపుతున్న షేర్ల బైబ్యాక్ పద్ధతిని క్రమేపీ ఎత్తివేయనున్నట్టు సెబీ ప్రకటించింది. అందుకు బదులుగా టెండర్ ఆఫర్ మార్గంలో షేర్ల బైబ్యాక్ను ప్రవేశపెడతామని సెబీ చైర్పర్సన్ మధాబి పూరి బుచ్ వెల్లడించారు. మంగళవారం సెబీ బోర్డు సమావేశం జరిగిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బహిరంగ మార్కెట్లో బైబ్యాక్లు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉన్నందున టెండర్ రూపంలో అమలు చేయాలంటూ కేకి మిస్త్రీ కమిటీ చేసిన సిఫార్సులకు అనుగుణంగా మార్పులు చేస్తామన్నారు. అలాగే బైబ్యాక్ కోసం కేటాయించిన మొత్తంలో కంపెనీలు వినియోగించాల్సిన కనీస పరిమితిని 50 శాతం నుంచి 75 శాతానికి పెంచుతున్నట్టు తెలిపారు. ఎక్సేంజ్ల ద్వారా బైబ్యాక్లను తాము అనుమతించేవరకూ వాటిని స్టాక్ ఎక్సేంజీల్లోని ప్రత్యేక విండోల్లో అమలు చేయాలని చెప్పారు.