న్యూఢిల్లీ, జూలై 5: ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో ప్రతిపాదించిన రూ.8,250 కోట్ల ఇనీషియల్ పబ్లిక్ ఇష్యూకు (ఐపీవో) మార్కెట్ రెగ్యులే టర్ సెబీ అనుమతి లభించింది. ప్రాథమిక ఐపీవో పత్రాల్ని ఈ ఏడాది ఏప్రిల్లో సెబీకి జొమాటో సమర్పించింది. కాగా, ఫిబ్రవరిలో టైగర్ గ్లోబ ల్, కొరా తదితర ఇన్వెస్టింగ్ సంస్థల నుంచి జొమాటో రూ.1,800 కోట్ల నిధుల్ని సమీకరించింది. సంస్థను రూ.40 వేల కోట్ల కంపెనీగా విలువ కడుతూ ఆ పెట్టుబడులు జరిగాయి.