న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ఒక ప్రముఖ బిజినెస్ చానల్లో స్టాక్ సిఫార్సులిచ్చే 10 మంది నిపుణులు, సంస్థలను నియంత్రణా సంస్థ సెబీ నిషేధించింది. షేర్ రిగ్గింగ్కు పాల్పడి చట్టవిరుద్ధంగా వారు ఆర్జించిన రూ. 7.41 కోట్లను స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టింది. సెబీ దర్యాప్తు వివరాల ప్రకారం జీ బిజినెస్ న్యూస్ చానల్లో ఏ స్టాక్స్ను సిఫార్సు చేస్తున్నామన్నది గెస్ట్ నిపుణులు ముందుగానే కొంతమంది‘ప్రాఫిట్ మేకర్స్’కు చెపుతారు. సమాచారం అందుకున్న ప్రాఫి ట్ మేకర్స్ తొలుత ఆ షేరు లేదా డెరివేటివ్ కాంట్రాక్టులో పొజిషన్లు తీసుకుంటారు.
గెస్ట్ అనలిస్టులు కిరణ్ జాదవ్, అశీష్ కేల్కర్, హిమాన్షు గుప్తా, ముదిత్ గోయల్, సిమి భౌమిక్ల సిఫార్సులు చానల్లో ప్రసారం అయిన తర్వాత ఆ పొజిషన్లను రివర్స్ చేయడం ద్వారా లాభం సంపాదిస్తా రు. ఈ ఉదంతంలో నిర్మల్ కుమార్ సోని, పార్థసారథి ధర్, శార్ కమోడిటీస్, మానన్ షేర్కామ్, కన్హా ట్రేడింగ్ కంపెనీలు ప్రాఫిట్ మేకర్స్గా వ్యవహరించారని సెబీ పేర్కొంది. ఆ లావాదేవీల్లో వచ్చిన లాభాల్ని అందరూ పంచుకుంటారని తెలిపింది. దర్యాప్తు అనంతరం సెబీ 127 పేజీల ఆర్డర్ను జారీచేస్తూ ఆ పది సంస్థలు, వ్యక్తుల్ని సెక్యూరిటీల లావాదేవీల నుంచి నిషేధించింది. గెస్ట్ నిపుణులకు సంబంధించిన కంటెంట్తో సహా వీడియో రికార్డులు, ఇతర రికార్డుల్ని భద్రపర్చాలని జీ మీడియాను ఆదేశించింది.