SBI Alert | ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్. ఈ నెల 22న బ్యాంకింగ్ మెయింటెనెన్స్ అంశాల వల్ల ఈ నెల 22 (శనివారం)వ తేదీన బ్యాంక్ డిజిటల్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోతాయి. బ్యాంకు డిజిట్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్స్ అప్గ్రేడింగ్ పనులు చేపడుతున్నట్లు ఎస్బీఐ శుక్రవారం ఓ ట్వీట్లో తెలిపింది. తత్ఫలితంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యూపీఐ సేవలు శుక్రవారం అర్ధరాత్రి తర్వాత శనివారం తెల్లవారు జామున రెండు గంటల నుంచి ఉదయం 8.30 గంటల వరకు డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యోనో బిజినెస్, యూపీఐ సేవలు నిలిచిపోతాయని వెల్లడించింది. తమ ఖాతాదారులు తమను అర్థం చేసుకోవాలని కోరింది. ఇంతకుముందు గత నెల 11న బ్యాంకింగ్ వ్యవస్థ మెయింటెనెన్స్ పనుల వల్ల డిజిటల్ సేవలు నిలిచిపోయాయి.
మీరు ఎస్బీఐ కస్టమర్ అయితే, మీ బ్యాంక్ ఖాతాలో మినీ స్టేట్మెంట్ కావాలనుకుంటున్నారా.. బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవాలనుకున్నట్లయితే 09223766666 అనే ఫోన్ నంబర్కు బీఏఎల్ అని టెక్స్ట్ పంపితే సమాచారం వస్తుంది. మిస్డ్ కాల్ ఇచ్చినా.. ఎస్సెమ్మెస్ పంపినా మీ బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్, మినీ స్టేట్మెంట్ ఇతర వివరాలు తెలుసుకోవచ్చు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఆధ్వర్యంలో ఎస్బీఐ ఖాతాదారులకు ఈ డేటా అందుబాటులోకి తెచ్చింది.